Revnth reddy | రాష్ట్రంలో మరో భారీ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెర తీశారు. కొద్ది రోజులుగా పాలిటెక్నిక్ కాలేజీల విలీనం వద్దని ఉద్యార్థులు రోడ్లపై కొచ్చి ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనం వెనుక సీఎం రేవంత్ రెడ్డి భారీ కుట్రకు వ్యూహ రచన చేశారు. దీనిపై తెలుగు స్క్రైబ్ పరిశీలనలో దిమ్మదిరిగే విషయాలు బయటపడటం కలకలం రేపింది.
రూ. 30,000 కోట్ల విలువైన 60 పాలిటెక్నిక్ కాలేజీల భూములను కాజేసేందుకే రేవంత్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. గత 2 వారాలుగా పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్ల మీదకెక్కి జీవో 97ను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా మొండిపట్టుదలకు పోయిన రేవంత్.. జీవో 97పై కమిటీ వేసి డైవర్షన్ డ్రామా మొదలు పెట్టారు. పాలిటెక్నిక్ కాలేజీ 1923లో నిజాం హయాంలోనే మాసబ్ట్యాంక్ వద్ద ప్రారంభమైంది.103 ఏళ్లుగా పేద విద్యార్థులకు తక్కువ ఫీజులో అత్యున్నత విద్యను అందిస్తున్నది.
మరోవైపు వందల కోట్లతో ప్రారంభించిన రేవంత్ బ్రెయిన్చైల్డ్ స్కిల్ వర్సిటీ అట్టర్ ఫ్లాప్ గా మారింది.
ఈ నేపథ్యంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అని భావించిన సీఎం జీవో 97 పేరుతో విలీనం ప్లాన్ చేశాడు. వేల కోట్ల రూపాయల కాలేజీ భూములను కాజేస్తూ.. తన స్కిల్ వర్సిటీని విద్యార్థులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి నగరాల్లో మెయిన్ రోడ్ కాలేజీ భూములపై రేవంత్ కన్నుపడింది. మొన్న హెచ్సీయూ 400 ఎకరాలు.. నిన్న ఉర్దూ వర్సిటీ 50 ఎకరాలు.. నేడు పాలిటెక్నిక్ భూములు ఇలా విలువైన భూములను కొల్లగొట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిసింది.
పాలిటెక్నిక్ విలీనం.. రూ. 30,000 కోట్ల స్కాం
ఫెయిల్యూర్ వెంచర్ స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనం వెనుక రేవంత్ భారీ కుట్ర
తెలుగు స్క్రైబ్ పరిశీలనలో పాలిటెక్నిక్ విలీనంపై బయటపడిన దిమ్మదిరిగే విషయాలు
రూ. 30,000 కోట్ల విలువైన 60 పాలిటెక్నిక్ కాలేజీల భూములను కాజేసేందుకే… https://t.co/9r0OecwTjQ pic.twitter.com/cg5mx7k7yI
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026