హైదరాబాద్: మరో రెండు గంటల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపా మరో 11 మంది మంత్రులుగా (Cabinet Ministers) ప్రమాణం చేస్తారు. ఈ మేరకు గవర్నర్ తమిళసైకి మంత్రుల జాబితాను పంపించారు. వారిలో ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భట్టి విక్రమార్క, పొగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సుదర్శన్ రెడ్డి ఉన్నారు.
కాగా, ఉపముఖ్యమంత్రిగా ఒక్కరిని మాత్రమే నియమిస్తారని తెలుస్తున్నది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్తో పోటీపడిన మల్లు భట్టివిక్రమార్కను డిప్యూటీ సీఎంగా చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఇక సీఎం పదవి కోసం చివరివరకు ప్రయత్నం చేసిన మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇక కొత్తగా మంత్రులుగా ప్రమాణంచేయనున్న వారిలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు, ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి ఒక్కరు (సీఎం రేవంత్తో కలిపితే ఇద్దరు), నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు, ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు, కరీనంగర్ నుంచి ఒక్కరు, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.