హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శుక్రవారం ఢిల్లీలో లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు తన రాజీనామా లేఖను సమర్పించారు. రేవంత్ రెడ్డి స్పీకర్ను కలిసినప్పుడు ఆయన వెంట తెలంగాణ వ్యవహారాల మాజీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ కూడా ఉన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. గురువారం తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడంతో ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. శనివారం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.