హైదరాబాద్ : సింగరేణి కాలనీ సంఘటన దుదృష్టకరం. హంతకున్ని పట్టుకోని కఠినంగా ప్రభుత్వం శిక్షిస్తదని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. మంగళావరం ఎమ్మెల్సీ మల్లేశంతో కలిసి టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ..మల్లారెడ్డి టు మై హోం..మేఘా టు నవయుగ వరకు రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ దందాను ఎవరిని అడిగినా చెప్తారన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హోల్ సేల్ బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్అ ని ద్వజమెత్తారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి ..కేటీఆర్ ఐటీకి నవ యువ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు అని మర్చిపోవద్దన్నారు. డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం పంజాబ్ అనేది రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని హితవు పలికారు. టీఆర్ఎస్ డేటాతో మాట్లాడితే- రేవంత్ రెడ్డి నోటి తీట తో మాట్లాడుతాడని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అంతా రౌడీ షీటర్లతో నిండి ఉండేది. ఇప్పుడు సింగపూర్- బ్యాంకాక్ తరహాలో క్రైమ్ కంట్రోల్ టీఎస్ పోలీస్ చేస్తోందని ప్రశంసించారు.
తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే కాంగ్రెస్కు పట్టబోతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్సైజ్ ఆదాయాలు ఉన్నాయి. మరి అక్కడి సీఎంలు తాగుబోతులా? అని సూటిగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్లకు నేను సవాల్ చేస్తున్నా.. ఏ వేదికగా నైనా చర్చకు నేను సిద్ధం. టీఆర్ఎస్ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ పాదయాత్ర అట్టర్ ఫెల్యూర్ అయింది. ఇతర జిల్లాల నుంచి ప్రజలను యాత్రకు తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు.
బండి సంజయ్ కి దమ్ము ఉంటే కేంద్రం నుంచి రూ.20వేల కోట్లు తెచ్చి రైతుల ధాన్యం కొనుగోలు చేయండని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడితే సహించబోమన్నారు. ఎమ్మెల్సీ మల్లేశం మాట్లాడుతూ..సింగరేణి కాలనీ జరిగిన ఘటన దురదృష్టకరం. కలెక్టర్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ప్రతి విషయానికి సీఎం రావాల్సిన పనిలేదు.
సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ స్థాయికి బండి సంజయ్, రేవంత్ రెడ్డి సరిపోరని పేర్కొన్నారు. హుజురాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమన్నారు. బీజేపీతోనే టీఆర్ఎస్ కు పోటీ.
హుజురాబాద్లో ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలన్నారు. ఎవరైనా సీఎం కేసీఆర్ను అకారణంగా దూషిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
రైతు బీమా తరహాలో గీత కార్మికులకు బీమా పాలసీ : మంత్రి హరీశ్రావు
మనం మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలి.. ప్రభుత్వం మాట ఇదీ!
రైతులు, కూలీలను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి కేటీఆర్