హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజుల నుంచి తనను కలిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నియంత్రణ జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.