మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఉద్యోగులు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పరుగులు పెడుతుందని అన్నారు.
ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటూ ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తుందని అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రాల్లో జరగని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో రాఘవరెడ్డి, అచ్చిరెడ్డి, సిరాజుద్దీన్, అంజిరెడ్డి, చిన్నయ్య, వెంకటస్వామి యాదవ్, అయూబ్, చంద్రయ్య గౌడ్ సహా మరికొంత మంది బీఆర్ఎస్ చేరిన సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, కౌన్సిలర్ అనంతరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పిల్లి సురేశ్, జిల్లా గ్రంథాలయ సభ్యురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.