కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఫైర్
కల్లూరు రూరల్, మే 29: కేంద్రంలోని బీజేపీ సర్కారు చేతకాని తనం వల్లే దేశంలో రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరల పెరుగుతున్నాయని కాం గ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రూ.60 ఉన్న లీటర్ పెట్రోల్ ధర నేడు రూ.120కి చేరిందన్నారు.
ఇందుకు మోదీ ప్రభుత్వం కారణం కాదా? అని ప్రశ్నించారు. ఆదివారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బత్తులపల్లి, కప్పలబంధం గ్రామాల్లో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో వీహెచ్ మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ, అదానీలకు మోదీ ధారాదత్తం చేస్తున్నాడని విమర్శించారు.