హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : భూసారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ‘రైతుల వారోత్సవం’లో భాగంగా మంగళవారం హైదరాబాద్లో అగ్రిడాక్టర్లు, రైతులతో నిర్వహించిన సమావేశంలో తుమ్మల మాట్లాడారు. దాదాపు 40 వేల సాయిల్ వలంటీర్లను ఎంపిక చేసి, మట్టి నమూనాలు సేకరించి, సాయిల్ హెల్త్ కార్డులను అధికారులే విశ్లేషించాలని మంత్రి ఆదేశించారు. సేంద్రి య సాగు వైపు రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్తలను రైతుల వద్దకు పంపి అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. సేంద్రియ రైతుల కోసం ‘టీజీ ఆర్గానిక్ యాప్’ను ఆవిష్కరించినట్టు మంత్రి వెల్లడించారు.