హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై బీసీ, రజక సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేశారు. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రజకసంఘాల నాయకులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఐలమ్మ కాంస్య విగ్రహానికి టీఆర్ఎ స్ నాయకులు పాలాభిషేకం చేశారు. సూర్యాపేటలోని తెలంగాణ తల్లి విగ్ర హం వద్ద సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర ముఖ్య సలహాదారు, ఎంబీసీ కోకన్వీనర్ కొండూరి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయానికి సహకరించిన మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్ఛా కార్యదర్శి బండారి భాస్కర్ స్వాగతించారు.