హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కోరారు. బుధవారం లోక్భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసి గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల భూ హక్కుల పరిరక్షణ, పోడు వ్యవసాయం, పెసా చట్టం అమలు, గిరిజన ప్రాంతాల్లో విద, వైద్యం, తాగునీరు తదితర అంశాలను పరిష్కరించాలని గవర్నర్ను కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సమస్యలకు సానుకూలంగా పరిశీలించి, సాధ్యమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్టు దత్తాత్రేయ తెలిపారు.