ముప్కాల్/మెండోరా/వేల్పూర్/భీమ్గల్, సెప్టెంబర్ 6: రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి అండగా ఉంటామంటూ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. పలు గ్రామాల వారు వేముల వెంటే ఉంటామని ప్రకటిస్తున్నారు.
బుధవారం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నల్లూర్లోని మాదిగ సంఘానికి చెం దిన 51 కుటుంబాలు, మెండోరా మండలం ఎల్కటూర్కు చెందిన వడ్డెర సం ఘం, వేల్పూర్ మండలం వాడిలోని ఎస్సీ మాల సంఘానికి చెందిన 73 కుటుంబాలు, భీమ్గల్ మండలం ముచ్కూర్కు చెందిన మున్నూరు కాపు సంఘం-1 మంత్రికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.