చందూర్, సెప్టెంబర్ 29 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. చందూర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం వచ్చిన స్పీకర్కు పలు కుల సంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు.
చందూర్లోని 14 కులసంఘాలు, మేడిపల్లి తండాపంచాయతీ పరిధిలోని లక్ష్మీసాగర్ తండా, మాటు కాలువ తండా, నడిమి తండా, కేకే తండా, మేడిపల్లి తండా వాసులు, పలు కులసంఘాల పెద్దలు వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించుకుంటామని తీర్మానం చేసి ఆ ప్రతిని స్పీకర్కు అందజేశారు.