వేల్పూర్/బాల్కొండ/మోర్తాడ్, సెప్టెంబర్ 13 : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మద్దతుగా తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం వేల్పూర్ మండలం పోచంపల్లి లోని మాల సంఘానికి చెందిన 38 కుటుంబాలు,
మాదిగ సంఘానికి చెందిన 24 మంది, గూండ్ల సంఘానికి చెందిన 21 కు టుంబాల వారు, బాల్కొండ మండలంలోని కిసాన్నగర్ మాదిగలు, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ యాదవ సంఘం సభ్యులు మంత్రి వెంటే ఉంటామంటూ తీర్మానం చేశారు.