నేరడిగొండ, ఆగస్టు 30: దేశమంతా వినాయక చవితిని బుధవారం జరుపుకొంటుంటే.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం తేజాపూర్ వాసులు మాత్రం మంగళవారమే నిర్వహించారు. వారికి బుధవారం కలిసిరాదు. అందుకే ఘాతవారంగా భావిస్తారు. ఆ రోజు గ్రామం లో ఎలాంటి పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుపుకోరు.
ఇది వారి కి ఆనవాయితీగా వస్తున్నది. అందుకే బుధవారం నిర్వహించాల్సిన చవితిని మంగళవారమే జరుపుకొన్నారు. గణనాథులను ప్రతిష్ఠించారు. మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు.