హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): హజ్యాత్రలో విషాదం నెలకొంది. మహబూబ్నగర్కు చెందిన ఎండీ శంషీర్పాషా(56)-షహేనాబేగం దంపతులు ఈ నెల 11న హజ్యాత్రకు బయలుదేరారు. శంషీర్కు రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో తెలంగాణ హజ్ కమిటీ అధికారులు వెంటనే సౌదీలోని కింగ్ ఫైసల్ దవాఖానకు తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు. హజ్ యాత్రికుడి మృతిపై తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీమ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శంషీర్ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శంషీర్ అంత్యక్రియలను కమిటీ ఆధ్వర్యంలో అక్కడే నిర్వహించనున్నట్టు వెల్లడించారు. వివరాలకు 9948154784ను సంప్రదించాలని సూచించారు.