హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూ మరసీ (ఎఫ్ఎల్ఎన్), ఉన్నతి వంటి కార్యక్రమాల్లో తలెత్తుతున్న సమన్వయలోపాన్ని సరిదిద్దాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. శనివారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేను తపస్ నేతలు కలిసి వినతి పత్రం అందజేశారు.
విద్యాశాఖ కమిషనరేట్ నుంచి వచ్చే సమాచారం ఒకరకంగా, డీఈవోలు మరో రకంగా సమాచారాన్ని ఇస్తుండటంతో గందరగోళం నెలకొంటున్నదని, దీనిని సమీక్షించి లోపాలను సరిదిద్దాలని వినతిలో కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హనుమంతరావు, సురేష్, విష్ణువర్ధన్రెడ్డి, ఉషారాణి, పెంట య్య, కళావతి, కాశిరావు తదితరులు పాల్గొన్నారు.