హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖలో పెండింగ్లో ఉన్న తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించాలని సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్ను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెట్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్
కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం సచివాలయంలో సీఎంవోను కలిశారు. 2016 తర్వాత తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్లు రాలేదని గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అన్ని శాఖల మాదిరిగా రెవెన్యూలోనూ వీలైనంత త్వరగా పదోన్నతులు కల్పించాలని కోరారు. తమ విజ్ఞప్తిపై ఆమె సానుకూలంగా స్పందించారని ట్రెసా నేతలు తెలిపారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు ట్రెసా ఆధ్వర్యంలో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ను కలిసి, పదోన్నతులపై విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ట్రెసా అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, నాయకులు రమేశ్, సునీల్, వకీల్, సుమ, నిర్మలాదేవి, శ్రీలత, మధు, వెంకటేశ్, పవన్ తదిత