అబిడ్స్, ఫిబ్రవరి 28: తెలంగాణ రాష్ర్టానికి చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత కళాకారిణి శ్వేతాప్రసాద్ 2022-23 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్కు ఎంపికయ్యారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఈ అవార్డును బుధవారం న్యూఢిల్లీలో ప్రకటించింది. సం గీత విభాగం కర్ణాటక మ్యూజిక్లో తెలంగాణ నుంచి శ్వేతాప్రసాద్ను ఎంపిక చేశా రు. శ్వేతాప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా మూ డు దశాబ్దాలుగా రెండు వేలకుపైగా గాత్ర ప్రదర్శనలు నిర్వహించారు. అన్నమాచార్య కృతులు, త్యాగరాజ కీర్తనలతో ప్రదర్శనలు ఇచ్చారు. దేశ విదేశాల్లో భరతనాట్యం, ఆం ధ్రనాట్యం కూచిపూడి విభాగాల్లో ప్రముఖ నాట్య కళాకారులకు గాత్రం, నట్టువాంగ సహకారం అందించారు.
పలు నృత్య ప్రదర్శనలకు స్వరకల్పన చేశారు. అమెరికా, చైనా, మలేషియా, టర్కీ, సిరియా, వియ త్నాం దేశాల్లో భారత సాంస్కృతిక మండలి తరఫున పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు రక్త కన్నీరు నాగభూషణం మనవరాలైన శ్వేతాప్రసాద్ నాలుగేం డ్ల ప్రాయంలోనే సంగీతం అభ్యసించారు. కర్ణాటక వోకల్, లలిత సంగీతంలో ఆకాశవాణి ఏ-గ్రేడ్ కళాకారిణి అయిన శ్వేతాప్రసాద్ ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో ఎంఫిల్ చేస్తున్నారు.