హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఏడాది అడ్మిషన్లు నిర్వహించేందుకు కోర్సుల రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో ఇప్పటివరకు తనిఖీలు, అనుమతి ప్రక్రియ పూర్తి కాకుంటే..ఆటోమెటిక్గా రెన్యూవల్ చేస్తున్నట్టు పేర్కొన్నది. ఫిర్యాదులు వచ్చిన కాలేజీలు, అనుమతులు రద్దు చేసిన కళాశాలలు, అడ్మిషన్లు ఆపాలని ఎన్ఎంసీ సూచించిన కాలేజీలకు మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నది. 2022-23లో అనుమతి ఇచ్చిన సీట్ల సంఖ్యకు సమానంగా ఈ ఏడాది అడ్మిషన్లు తీసుకోవాలని సూచించింది.