Election commission | ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (Election commission) 15న విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో ‘కారు’ను పోలిన గుర్తు లతో జరిగిన నష్టాన్ని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఫలితంగా ఈ సారి జారీ చేసిన గుర్తుల జాబితాలో.. బీఆర్ఎస్ ఆక్షేపించిన గుర్తులను ఇటు తెలంగాణతోపా టు, అటు ఏపీలోనూ ఎవరికీ కేటాయించకూడదంటూ ఈసీ ఆదేశాలు జా రీ చేసింది. దాని ప్రకారం.. ఆటోరిక్షా, హ్యాట్ (టోపీ), ఇస్త్రీపెట్టె, ట్రక్ గుర్తులను నిషేధిస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్నది. మొత్తం 193 గుర్తులను జాబితాలో పొందుపరిచింది.
తెలంగాణలో నాలుగు పార్టీలు
రాష్ట్రంలో నాలుగుపార్టీలను ఈసీ గుర్తించింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి కారు గుర్తు, ఎంఐఎంఐఎం పార్టీకి గాలిపటం గుర్తు, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ)కి సీలింగ్ ఫ్యాను గుర్తును ఖరారు చేస్తూ నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఏపీ విషయానికొస్తే.. కేవలం రెండే రెండు పార్టీలను ఎన్నికల సంఘం గుర్తించింది. వైఎస్సాసీపీకి సీలింగ్ ఫ్యాన్, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఖరారు చేసినట్టు ఈసీ వెల్లడించింది.