Telangana | హైదరాబాద్ : తెలంగాణకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల గన్మెన్లను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీసు శాఖ చర్యలు ప్రారంభించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద ఉన్న గన్మెన్లను పోలీసు ఉన్నతాధికారులు వెనక్కి పిలిపించారు. ఎవరెవరికి గన్మెన్లు అవసరమనే దానిపై ఉన్నతాధికారులు సమీక్షించనున్నారు. ఆ నివేదిక మేరకు గన్మెన్లను పోలీసు శాఖ కేటాయించనుంది.