హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులకు అందాల్సిన వివిధ సెటిల్మెంట్ నిధుల విడుదల ప్రక్రియ వేగవంతమైంది. రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, టెర్మినల్ లీవ్ ఎన్క్యాష్మెంట్, సెటిల్మెంట్లకు సంబంధించిన నిధుల వినియోగంపై స్పష్టత ఇ స్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశా రు.
సాధారణ ఉద్యోగ విరమణ పొం దిన వారికి సెప్టెంబర్ 2024 వరకు, అనారోగ్యం కారణంగా రిటైర్ అయిన వారికి(వీఆర్ఎస్), మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు మార్చి 2026 వరకు టెర్మినల్ లీవ్ ఎన్క్యాష్మెంట్ కు నిధులు మంజూరు చేశారు. సాధారణ రిటైర్మెంట్ పొందిన వారికి నవంబర్ 2025 వరకు, ఇతరులకు (మెడికల్ అన్ఫిట్/వీఆర్ఎస్/డిసీసె డ్) గ్రా ట్యుటీ మార్చి 2026 వరకు ని ధులు విడుదలయ్యాయి. సెటిల్మెం ట్ సా లరీ, ఏఎంబీఎఫ్, ఆర్పీఎస్, 2013 బాండ్ల నిధులు మార్చి 2026 వరకు చెల్లించినట్లు అధికారులు తెలిపారు.