హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి, భూపాలపల్లి పోలీస్స్టేషన్లలో 2023లో నమోదైన రెండు క్రిమినల్ కేసుల విచారణకు హాజరు నుంచి సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. 2023 ఫిబ్రవరి, మార్చిల్లో జరిగిన రెండు బహిరంగ సభల్లో నాడు మలాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్రెడ్డి అనుచిత విమర్శలు చేయడంపై బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని రేవంత్రెడ్డి వేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ కే సుజన విచారణ చేపట్టారు. రేవంత్రెడ్డి కింది కోర్టు విచారణకు మినహాయింపు ఇచ్చిన న్యాయమూర్తి, కౌంటరు దాఖలు చేయాలని గండ్ర రమణారెడ్డిని ఆదేశించారు. విచారణను మార్చి 5 నాటికి వాయిదా వేశారు.