హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): 12 నెలలుగా పెండింగ్లో ఉన్న సోలార్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కర్ణాటకలోని బీదర్లో నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరైన కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి భగవంత్ కుబాకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బీ అశోక్కుమార్, ప్రధాన కార్యదర్శి టీ శ్రీహరిబాబు, ఉపాధ్యక్షుడు పర్కాల రాజేశ్, జాయింట్ సెక్రటరీ బాబునాయుడు తదితరులు పాల్గొన్నారు.