హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఏదైనా కార్యం తలపెట్టే ముందు శుభముహూర్తం చూసుకొని ప్రారంభించడం ముఖ్యమంత్రి కేసీఆర్కు అలవాటు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలలో కూడా ఆయన యథావిధిగా ఆ సంప్రదాయాన్ని పాటించారు. శ్రావణ సోమవారం మధ్యాహ్నం 2.38 గంటలకు ధనుర్లగ్నంలో పార్టీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు.
ధనస్సు యుద్ధరాశి, లగ్నానికి గురుదృష్టి భాగ్యంలో ధర్మకర్మాధిపతుల యుతి రాజయోగ కారకము ప్రతాపాధిక్యాన్ని ఇస్తుందని పండితులు చెప్తారు. రాజ్యస్థానంలో శశిమంగళ యోగము స్వతస్సిద్ధంగా యోగ కారకమని పేర్కొంటున్నారు. అత్యంత శుభప్రదమైన ఈ ముహూర్తంలో తలపెట్టిన కార్యాలు దిగ్విజయమవుతాయని నమ్మకం. కేసీఆర్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఈ శుభ ముహూర్తంలో ప్రకటించడం విశేషం.