హైదరాబాద్, మే2 (నమస్తే తెలంగాణ): 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బోర్డు నిర్వహణకు తన వాటాగా రూ.20.13కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీ గురువారం లేఖ రాసింది. బోర్డు నిర్వహణకు నిధులను ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు సమాన వాటా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది బడ్జెట్కు ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరానికి 23.17కోట్ల బడ్జెట్కు ఆమోదించారు. రెండేండ్లుగా తెలంగాణ తన వాటా బడ్జెట్ను చెల్లించడం లేదు. ఆ మొత్తం కలిపి 20.13కోట్లను వెంటనే చెల్లించాలని బోర్డు లేఖ రాసింది.