జాతీయ విద్యా విధానం-2020ని తిరసరించాలి: టీఎస్యూటీఎఫ్
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని సమర్థంగా అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ (టీఎస్యూటీఎఫ్) పేర్కొన్నది. ఆది, సోమవారాల్లో రెండు రోజులపాటు నాగర్కర్నూల్లో జరిగిన సమావేశాల్లో పలు అంశాలపై తీర్మానాలు చేసింది. వాటిని మంగళవారం విడుదల చేసింది. దేశంలో విద్య ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ, రాష్ర్టాల హకులు హరించి విద్యపై కేంద్ర పెత్తనాన్ని పెంచి, లౌకిక తత్వానికి విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం-2020ను రాష్ట్రంలో అమలు చేయకూడదని సమావేశం తీర్మానించింది. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావ రవి మంగళవారం హైదరాబాద్లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి సమాంతరంగా ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలనే నిర్ణయాన్ని ఫెడరేషన్ స్వాగతించింది. ఇంగ్లిష్ మీడియం కోసం అదనంగా అవసరమైన ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు చేపట్టాలని కోరింది. రెండు రోజుల సమావేశాల్లో 36 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈనెల 14 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్ మండల శాఖల ఆధ్వర్యంలో పాఠశాలల్లో పర్యటించి సమస్యలపై సర్వే నిర్వహించి ఏప్రిల్లో నివేదిక తయారుచేస్తామని వెల్లడించింది.