తిరుపతి : తిరుమలలో సంప్రదాయ భోజనంపై టీటీడీ వెనక్కి తగ్గింది. సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు. ఇవాళ ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ పాలక మండలి లేని సమయంలో టీటీడీ అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశ పెట్టారన్నారు.
అయితే సంప్రదాయ భోజనంపై అధికారులతో చర్చించి సంప్రదాయ భోజనంను నేటి నుంచి నిలిపి వేస్తున్నాంమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సోషల్మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని భక్తులు ఎవరు నమ్మద్దని ఆయన కోరారు. కృష్ణాష్టమి సందర్భంగా టీటీడీలో నూతన సేవకు శ్రీకారం చుట్టబోతున్నాంమని, కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నవనీత సేవ కార్యక్రమాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
టీటీడీలో ఇప్పటికే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే గుడికో గోమాత, గోపూజ, గోవిందునికి గోధారిత నైవేద్యం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ..నవనీత సేవ లాంటి ఒక కొత్త అధ్యయంకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. శ్రీవారి నైవేద్యంకు, కైంకర్యాలకు కావాల్సిన పదార్థాలు సంప్రదాయబద్ధంగా గోవు నుంచి పాలను, నెయ్యిని, వెన్నను సేకరచి స్వామి వారికి అందింస్తున్నట్లు తెలిపారు.
తిరుమలలో ఏ ఆహారంమైన స్వామి వారి ప్రసాదంగానే అందించాలని అందుకనే సంప్రదాయ భోజనంను నిలిపి వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో సర్వదర్శనాలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోంమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసారు.
ఇవి కూడా చదవండి..
Nalgonda : సీఎం కేసీఆర్ పూడిక తీసిన చెరువుకు జలకళ
Pfizer vaccine: న్యూజిలాండ్లో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న మహిళ మృతి
రాష్ట్రం వ్యాప్తంగా దంచికొట్టిన వాన