హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జర్నలిస్టు ఊహాజనిత విశ్లేషణను బీజేపీ మౌత్ పీస్లాగా మారిన కొన్ని మీడియా సం స్థలు కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గాలి వార్తలతో రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు కాషాయ మీడియా తన శక్తినం తా ధారపోస్తున్నదని ఆరోపించారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో దూ సుకెళ్తుండటంతో కాంగ్రెస్, బీజేపీకి నిద్రపట్టడం లేదని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దక్షిణాది నుంచి సీఎం కేసీఆర్ ఎదుగుతుంటే, ఉత్తరాది నాయకులు సహించడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాన్ని అసలే చూపించని బీజేపీ భజన పత్రికలు, చానళ్లు, రాష్ట్ర ప్రగతిని దెబ్బతీసే గాలి వార్తలకు మాత్రం ప్రాధాన్యం ఇస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, దాని అనుబంధ మీడియా సంస్థలు ఎన్ని కుట్రలు, రాష్ట్రంలో, దేశంలో ఎగిరేది గులాబీ జెండాయేనని చెప్పారు.