తాడ్వాయి, మార్చి 19: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని జనగలంచ సమీప అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గొత్తికోయలకు రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి సోలార్ లైట్లను పంపిణీ చేశారు. ఆదివారం ఆయన గూడేన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారి జీవన విధానాన్ని తెలుసుకున్నారు.
విద్యుత్తు సౌకర్యం లేకుండా అటవీ ప్రాంతాల్లో ఎలా జీవిస్తున్నారో ఆరా తీశారు. రాత్రి వేళలో వారికి ఉపయోగపడేలా సోలార్ లైట్లను ఇంటింటికీ పంపిణీ చేశారు.