ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 24: ఖమ్మం జిల్లాలో మిర్చికి అత్యధిక ధర లభిస్తున్నది. అత్యంత నాణ్యత ఉండటంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తూ.. నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జెండాపాట సమయానికి మిర్చి యార్డుకు సుమారు 52 వేల బస్తాల మిర్చి రాగా ఇందులో నాన్ ఏసీ పంట ధర క్వింటాకు రూ.20,800 పలికి ఆల్ టైం రికార్డు సాధించింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. రెండు రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2 వేలు పెరిగింది.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ శుక్రవారం ఎర్రబంగారంతో ఎరుపెక్కింది. మార్కెట్లో ఎటుచూసినా మిర్చి బస్తాలతో నిండిపోయింది. ధర గత ఏడాది కంటే ఆశాజనకంగా ఉన్నది. తేజ రకం మిర్చి క్వింటాల్కు అత్యధికంగా రూ.19,800, వండర్హాట్ రూ.35 వేలు, యుఎస్ 341 రకానికి రూ.21,100, దేశీరకానికి రూ.53 వేలు, సింగిల్పట్టి రూ.38 వేలు పలికింది.