ఖమ్మం వ్యవసాయం/కాశీబుగ్గ, ఫిబ్రవరి 19: ఖమ్మం వ్యవసాయ, వరంగల్లోని ఎనుమాముల మార్కెట్లకు మిర్చి బస్తా లు పోటెత్తాయి. ఆదివారం సెలవు దినం కావడం.. సోమవారం మార్కెట్లలో క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాలు, ఏపీ రాష్ట్రం నుంచి దాదాపు లక్షల బస్తాల మిర్చిని విక్రయానికి తరలించడంతో యార్డులు పూర్తిగా నిండిపోయాయి. జాతీయ మార్కె ట్లో మంచి ధర పలుకుతుండటంతో స్థానిక వ్యాపారులు పోటీపడి పంట కొనుగోలు చేశారు. జెండా పాటలో మిర్చి పంట గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.20,850 పలికింది.
మధ్య రకం ధర రూ.19 వేలు, కనిష్ఠ ధర రూ.14 వేలు పలికింది. తాలు రకం పంట కు క్వింటాల్ రూ.12 వేల గరిష్ఠ ధరతో వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో తేజ రకం మిర్చికి అత్యధికంగా క్వింటాల్కు రూ.21 వేలు, కనిష్ఠంగా రూ.14 వేలు, వండర్హాట్ అత్యధికంగా రూ.21,500, కనిష్ఠంగా రూ.16 వేలు, యూఎస్ 341 రూ.20,500, కనిష్ఠంగా రూ.14 వేలు, దీపిక రకం మిర్చి అత్యధికంగా రూ.20 వేలు, కనిష్ఠంగా రూ.13 వేలు, దేశీ రకం మిర్చి అత్యధికంగా రూ.38, 500, కనిష్ఠంగా రూ.30 వేలు, తాలు ర కం మిర్చి రూ.8,500, కనిష్ఠంగా రూ.5,000 పలికినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి.