హైదరాబాద్, నవంబర్ 21, (నమస్తే తెలంగాణ): మహిళా శిశు సంక్షేమ శాఖలోని సూపర్వైజర్ల (గ్రేడ్ -2) పోస్టులు, సీడీఎస్ పరిధిలోని శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి (సీడీపీవో) పోస్టుల నియామక ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తిచేయాలని హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్కు అనుగుణంగా నిరుడు సెప్టెంబర్లో సీడీపీవో పోస్టులకు పరీక్షలు నిర్వహించినా.. ఇంతవరకు నియామకాలు చేపట్టలేదని పేరొంటూ కే నిఖిత మరో 12 మంది పిటిషన్ వేశారు. గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నియామకం కోసం నోటిఫికేషన్ జారీచేసి.. నియామకాలు చేపట్టలేదంటూ సంహిత సహా 39 మంది వేర్వేరుగా వ్యాజ్యాలను దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పీ మాధవీదేవి ఇటీవల విచారణ జరిపారు. పరీక్షలకు లీకేజీ మచ్చలేదని, కాబట్టి ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తిచేయాలని హైకోర్టు కమిషన్ను ఆదేశించింది.