Rajanna Temple | వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కేవలం 21 రోజుల వ్యవధిలో రూ.2.51కోట్లకుపైగా ఆదాయం వచ్చి చేరింది. ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. ఇందులో రూ.2,52,29,580 నగదు రూపేణా ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ తెలిపారు. అలాగే 227 గ్రాములకుపైగా బంగారం, 13.280 కిలోల వెండి కానుకలను భక్తులు సమర్పించారు. ఈవో కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ఉద్యోగులతో శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు హుండీలను లెక్కించారు. సీసీ కెమెరాల నిఘాలో ఈ లెక్కింపును నిర్వహించారు.