హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా గురువారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆయా గ్రామాల్లో ఓటర్లు బారులు తీరా రు. మందకొడిగా మొదలై మధ్యాహ్నం తర్వాత ఊపందుకొన్నది. మండల కేంద్రా లు, మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రాత్రి 10 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం 6 గంటల అనంతరం అనేక కేంద్రాల్లో భారీ క్యూలైన్లు కనిపించాయి. సాయంత్రం 5 గంటల వరకు 77.55 శాతం నమోదు కాగా, రాత్రి 11 గంటల వరకు అనధికారిక లెక్కల ప్రకారం 92 శాతం ఓట్లు పోలయ్యాయి. 2018 సాధారణ ఎన్నికల్లో మునుగోడు పోలింగ్ 91.4 శాతం నమోదైంది. దీన్ని దాటిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆఖరి నిమిషం వరకు హైడ్రామా
ఓడిపోతున్నామన్న భయంతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఆయన అనుచరులు ఆఖరి నిమిషం వరకు హైడ్రా మా సృష్టించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ప్రభావితం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఎన్నిక ల నిబంధనలకు విరుద్ధంగా కమలం గుర్తు ను ప్రదర్శించి, ఓటర్లను అయోమయానికి గురిచేశారు. పలుచోట్ల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయ త్నం చేసినా సంయమనం పాటించారు. చండూరులో మధ్యా హ్నం నుంచే బీజేపీ ఉద్రిక్త పరిస్థితులను సృష్టించి హంగామా చేసింది. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ప్రారంభం నుంచే కారు జోరు
పోలింగ్ ప్రారంభమైన ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు టీఆర్ఎస్ అనుకూల తీర్పు ఇచ్చారని పార్టీ ఏజెంట్లు పేర్కొన్నారు. తమకు నీళ్లిచ్చిన కేసీఆర్కే ఓటేశామని, రైతుబంధు ఇచ్చిన టీఆర్ఎస్కు వెన్నంటి ఉంటామని పలుచోట్ల ఓటర్లు చెప్పారు. హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాలకు వలసపోయిన వారు ఉదయమే తమ గ్రామాలకు చేరుకొని కేసీఆర్కే తమ మద్దతు అని ప్రకటించారు.
చేతులెత్తేసిన కాంగ్రెస్
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రె స్ చేతులెత్తేసింది. పాల్వాయి స్రవంతి పట్ల ఓటరు అయ్యో పాపం అన్న సానుభూతి తప్ప ఆశించినంత ఓట్లు పడలేదని ఆ పార్టీ వర్గాలే పేర్కొన్నాయి. కొన్నిచోట్ల మినహా కాంగ్రెస్ ప్రభావం పెద్దగా కనిపించలేదని తేలిపోయింది.
పసిబిడ్డలతో బారులు తీరి
అనేక పోలింగ్ కేంద్రాల్లో పసిబిడ్డలను ఎత్తుకొని తల్లులు తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. చౌటుప్పల్ మండ లం లింగోజిగూడెంలో సుజాత అనే బాలింత తన 17 రోజుల బిడ్డను ఇంట్లో ఉంచి ఓటేసింది. ‘కేసీఆర్ కిట్ కండ్ల ముం దట కనిపిస్తుంటే ఓటెయ్యాలని వచ్చిన’ అని మురిపెంగా పేర్కొన్నది. ఇలాంటి దృశ్యాలు పలు పోలింగ్ కేంద్రాల్లో దర్శనమిచ్చాయి.
పన్నెండుకు పన్నెండు స్థానాలు
ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 12. నాలుగేండ్లలో హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించింది. ఇదే ఒరవడి మునుగోడులోనూ కొనసాగుతుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఇక్కడ విజయం ఖాయమైతే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో చేరనున్నాయి.
బెడిసికొట్టిన బీజేపీ వ్యూహం
మునుగోడు పోరులో బీజేపీ బొక్కబోర్లా పడింది. రాజగోపాల్రెడ్డి ఓటుకు రూ.30 వేలు, మహిళలకు తులం బంగారం ఇస్తామని బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇది నిజమే అనుకొని ఓటర్లు మధ్యాహ్నం 3 గంటల వరకు ఇండ్లల్లోనే ఉండిపోయారు. ఆఖరుకు ఎవరూ రాకపోవడంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.
పోలింగ్ సరళి ఇలా
ఉదయం 11 గంటలకు : 25.1%
మధ్యాహ్నం 1 గంటకు :41.3%
మధ్యాహ్నం 3 గంటలకు :59.92%
సాయంత్రం 5 వరకు :77.55%