నల్లగొండ : సీఎం కేసీఆర్ పాలనలోనే పండుగలకు సరైన గుర్తింపు లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఆడపడుచు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. చిట్యాల మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరెలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాడని తెలిపారు. బతుకమ్మ పండుగకు వచ్చే ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు ఒక అన్నగా చీరెలను కానుకగా ఇస్తున్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అన్ని పండుగలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నదన్నారు.
తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, అధికారులు, పాల్గొన్నారు.