హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలకు నోటీసుల జారీ పర్వం కొనసాగుతున్నది. సోమవారం ‘స్వర్గసీమ’ సంస్థ సహా మూడు ప్రాజెక్టులకు రెరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘనపై 15 రోజుల్లోగా సంజయిషీ ఇవ్వాలని ఆ మూడు ప్రాజెక్టుల యజమానులను ఆదేశించారు.
రెరా రిజిస్ట్రేషన్ లే కుండా షాద్నగర్ సమీపంలోని చెరుకుపల్లి, కొందుర్గులో స్వర్గసీమ శాండల్ ఉడ్ ఫార్మ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్గసీమ సుకేతన పేరుతో నివాస ప్లాట్లు విక్రయించేందుకు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విసృ్తత ప్రచారం చేపట్టడంపై షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మాదాపూర్లోని సాలార్పురియా సత్వా నాలెడ్జ్ పారులోని జేఎల్ఎల్ నిర్మాణ సంస్థ రెరా రిజిస్ట్రేషన్ పొందకుండా రియల్ ఎస్టేట్ వ్యా పారం చేస్తుండటంతో షోకాజ్ నోటీసు జారీ చేశారు. మహేశ్వరం, తుకాపూర్ గ్రామం, శ్రీనగర్ ప్రాంతాల్లో కాంస్టెల్లా రియల్ ఎస్టేట్ సంస్థలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.