పరిగి, జూన్ 16: తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఉద్యోగాలు సాధించి వారిని సంతోష పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్రావు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘కొన్ని నెలలు మీ తాత్కాలిక ఆనందాలకు దూరంగా ఉండండి, ఉద్యోగాలు సాధించి జీవితాంతం ఆనందంగా బతకాలి’ అని సూచించారు. ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఉచితంగా కోచింగ్ ఇప్పించడంతోపాటు భోజన వసతి, స్టడీ మెటీరియల్ అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి, పరిగి, వికారాబాద్ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.