నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడు హిందీస్ కంపెనీలో పేలుడు ఘటనలో గాయపడిన కార్మికుడు మృతిచెందారు. గత నెల 24న హిందీస్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఐదురుగు కోలుకోగా, లక్ష్మారెడ్డి, బీహార్కు చెందిన బల్దేవ్ అనే కార్మికులు తీవ్రంగా గాయపడటంతో సికింద్రాబాద్ యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో బల్దేవ్ అనే కార్మికుడు దవాఖానలో మరణించారు.