హైదరాబాద్, ఏప్రిల్17 (నమస్తే తెలంగాణ): తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ జీఎస్టీ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను వికారాబాద్ జిల్లా ఆర్అండ్బీ శాఖ హైకోర్టులో సవాల్ చేసింది. సంగారెడ్డి డివిజన్లో ఆగస్టు 2013 నుంచి జూన్ 2016 మధ్య కాలంలో చేసిన పనులకు సంబంధిం చి సేవాపన్ను చెల్లింపు విషయంలో 2018లో సంబంధిత విభాగానికి జీఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. రూ.26,07,568 జరిమానా చెల్లించాలని ఆ నోటీసుల్లో పేరొన్నది. దీనిపై సంబంధిత శాఖ స్పందించకపోవడంతో, రూ.78.12 లక్షలు యాక్సిస్, ఎస్బీఐ ఖాతాల నుంచి మినహాయించుకునేలా జీఎస్టీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీనిని ఆర్అండ్బీ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సుజయ్పాల్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ గురువారం విచారణ చేపట్టే అవకాశం ఉన్నది.