హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 15 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్రెడ్డి కోరారు.
టీచర్ల బదిలీలు, పదోన్నతులతో సంబంధం లే కుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జారీ అయిన 5,089 పోస్టులకు అనుబంధంగా 15 వేలతో కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.