చండీగఢ్: పంజాబ్కు చెందిన పంజాబ్ ఏక్తా పార్టీ (పీఏపీ) కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సుఖ్పాల్ సింగ్ ఖైరా, జగదేవ్ సింగ్, పిర్మల్ సింగ్ గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పంజాబ్ ఏక్తా పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైనట్లు ప్రకటించారు.