హైదరాబాద్ : శాసన మండలి ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపికైన టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్ రావు గురువారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను మంత్రుల నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సత్యవతి రాథోడ్ రవీందర్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కష్టానికి, సహనానికి కచ్చితంగా ఫలితం లభిస్తుందనడానికి రవీందర్రావు నిదర్శమన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు పనిచేసి, మరింత వృద్ధిలోకి రావాలన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.