వనపర్తి : అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా..మంత్రి మాట్లాడుతూ..అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లాలో 3,302 మందికి తెల్లరేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. అందరికి కడుపునిండా తిండి పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్డులపై సన్న బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ,పింఛన్లు, రైతుబంధు, దళిత బంధు ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజల మీద ఉన్న మమకారం అర్థమవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పేదల కడుపు నింపేందుకే కొత్త రేషన్ కార్డులు
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా