హైదరాబాద్, పిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శుక్రవారం రథసప్తమి వేడుకలు వాహనసేవతో ప్రా రంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయా న్ని సర్వాంగ సుందరగా ము స్తాబు చేశారు. రకరకాల పు ష్పాలతో ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. వేడుకల్లో భాగంగా ఉదయం 5.30 గంటలకు శ్రీవారు సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. ఈ
వాహనసేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. స్వామివారి వాహన సేవలు రాత్రి వరకూ కొనసాగనున్నాయి. ఉదయం 11 గంటలకు చిన్న శేషవాహనం, మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత గరుడ వాహనం, ఆ తర్వాత హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించారు.