జన్నారం, ఫిబ్రవరి 14: మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ పరిధిలోని కిష్టాపూర్ సమీపంలో శనివారం ఓ అరుదైన పక్షిని ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఓ సెల్ టవర్పై పెరిగ్రిన్ ఫాల్కన్ అనే అరుదైన పక్షిని గుర్తించినట్టు ఎఫ్డీవో రామ్మోహన్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త డాక్టర్ ఎనగందుల వెంకట్ తెలిపారు.
ఈ పక్షి అన్ని ఖండాల్లో కనిపిస్తుందని, ఇటీవల నిర్వహించిన పక్షుల గణనలోనూ గుర్తించినట్టు తెలిపారు. ప్రపంచంలో అత్యంత అందమైన, శక్తివంతమైన పక్షిగా గుర్తింపుపొందిందని, 320కు పైగా కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ పక్షి కిలోమీటరున్నర ఎత్తులో ఎగురుతూ ఆహారాన్ని గుర్తించి వేటాడి తింటుందని తెలిపారు.