హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కూడా బీజేపీకి గుడ్బై చెప్పారు. ఈ మేరకు బుధవారం జేపీ నడ్డాకు రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా లేఖ పంపారు.
ఇక అంతా ఓకే అయితే రెండు, మూడు రోజుల్లోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఆదివారం ఆయన ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను, పరిశ్రమ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు.