హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రవాణా శాఖలో హైదరాబాద్ జేటీసీ సి.రమేశ్కు ఉద్యోగోన్నతి లభించింది. ఆయనను అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా బదిలీ చేస్తూ ఆదివారం సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది.‘ప్రభుత్వం అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ప్రమోషన్ కల్పించినందుకు సంతోషంగా ఉన్నదని, హైదరాబాద్ జేటీసీగా విధులు నిర్వహించిన రెండున్నరేండ్ల కాలంలో అందించిన సహకారం, మద్దతు మరవలేనిదని పేర్కొన్నారు.
నగరంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, రోడ్డు భద్రతా నియమాలను కఠినంగా అమలు చేయడంలో సదరు అధికారి తన హయాంలో విశేషమైన పాత్ర పోషించారు. ఇప్పుడు అడిషనల్ కమిషనర్గా మరింత విసృ్తతమైన బాధ్యతలను చేపట్టనున్నారు.