వెంకటాపూర్, నవంబర్ 18: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయంలో శనివారం నుంచి ఈనెల 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలను కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
మొదటి రోజైన శనివారం రామప్పలో ప్రారంభ కార్యక్రమం, ఫొటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు, 20న వరంగల్ కోటలో విద్యార్థులతో పరిశుభ్రత డ్రైవ్, 21న రామప్పలో విద్యార్థులచే పరిశుభ్రత డ్రైవ్, వ్యాస రచన పోటీలు, 22న వరంగల్ కోటలో స్థానిక కట్టడాల సందర్శన, 23న వరంగల్ కోటలో విద్యార్థులతో పరిశుభ్రత డ్రైవ్, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, 24న వరంగల్ కోటలో వారసత్వ కట్టడాలపై అవగాహన, 25న వరంగల్ కోటలో ముగింపు కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.