రఘునాథపాలెం, జూన్ 19: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో మతసామరస్యం వెల్లివిరిసింది. సర్పంచ్ షేక్ మీరాసాహెబ్ తన సొంత డబ్బులు వెచ్చించి రామాలయాన్ని నిర్మించారు. షేక్ మీరా సాహెబ్కు హిందూ ఆచారాలు, సంస్కృతి అంటే గౌరవం. తన సొంత డబ్బు 25 లక్షలతో గుడి నిర్మించారు. స్థానికులు కూడా తమకు తోచిన విధంగా విరాళాలిచ్చారు. ఓ ముస్లిం వ్యక్తి రూ.25 లక్షలు వెచ్చించి రాముడికి ఆలయాన్ని నిర్మించడంపై స్థానికులు అభినందనలు తెలిపారు.